🕑 Published: March 30, 2026 at 09:42 AM CST
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాషింగ్టన్ డీసీ ప్రాంత పార్టీ అభిమానులు, ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. అన్నగారి ఆశయమైన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదానికి కట్టుబడి అహర్నిశలూ తెలుగుదేశం పార్టీ, పేద, బలహీన వర్గాల సంక్షేమానికి, యువత భవితకు, మహిళా సాధికారతకూ వేదికగా, కోట్లాది మంది తెలుగువారి ఆస్తిగా, ప్రపంచ దేశాలలో లక్షలాది మంది యువతకు సాంకేతిక రంగ భవితకు స్ఫూర్తినందించిన వేదికగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇటీవల రాష్ట్ర శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తీర్మానం చరిత్రలో మైలురాయిగా, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటగా మిగిలిపోతుందని కార్యక్రమ సమన్వయకర్త భానుప్రకాష్ మాగులూరి అన్నారు. కార్యక్రమంలో యశస్వి బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి బొల్లినేని, రవి అడుసుమిల్లి, సాయిశ్రీనివాస రెడ్డి భూమిరెడ్డి, ఠాగూర్, వెంకటేశ్వర్రావు సామినేని, కిషోర్ కొడాలి, రామకృష్ణ ఇంటూరి, కృష్ణమోహన్ జంపాల, వినీల్ శ్రీరామినేని, మురళికృష్ణ కట్ల, హనుమంతరావు కూచి, రమేష్ రావిపూడి, సీతారామారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

