🕑 Published: March 30, 2026 at 09:38 AM CST
లండన్లోని నార్త్హోల్ట్ ప్రాంతంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర(బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) ఆధ్వర్యంలో ఆదివారం ఎస్.కె.ఎల్.పి.సి(SKLPC) సెంటర్లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాలను నిర్వహించారు. మంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలు భక్తులను మైమరిపించాయి. భజనలు, పల్లకీ సేవలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేడుకకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు తెలుగు సాంప్రదాయ భోజనప్రసాదం అందించారు. ఆలయంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అత్యాధునిక వంటశాల నిర్మాణానికి పలువురు దాతలు తమ వంతు విరాళాలను అందజేశారు.
కార్యక్రమ కన్వీనర్ మాట్లాడుతూ.. ఈ మహోత్సవం విజయవంతానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, లైఫ్ మెంబర్లు సహకరించారు.








