తుదిశ్వాస వరకు రచనలు చేస్తా-టాంటెక్స్ సదస్సులో షాడో మధుబాబు

🕑 Published: March 31, 2026 at 09:10 AM CST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ సాహిత్య వేదిక నిర్వహించిన “నెల నెలా తెలుగువెన్నెల” 224వ సాహిత్య సదస్సు 2026 గత ఆదివారం అంతర్జాలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న షాడో మధుబాబు ప్రసంగం సాహిత్య ప్రియులను ఆకట్టుకుంది. సాహిత్యవేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు. ముఖ్య అతిథి షాడో మధుబాబు జీవితం, రచనా ప్రయాణం గురించి ఆయన పరిచయం చేశారు. జూమ్ ద్వారా పాల్గొన్న వల్లూరు మధుసూదన రావు తన రచనా అనుభవాలను పంచుకున్నారు. తనకు ముందున్న విశ్వనాధ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి రచనలు, శరత్ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, కాశి మజిలీ కథలు, జానపద కథలు రచయితగా తన ఎదుగుదలకు దోహదపడ్డాయని తెలిపారు.

షాడో మధుబాబు తన ప్రసంగంలో గత అరవై సంవత్సరాలుగా రచనలు కొనసాగిస్తున్నానని, “డిటెక్టివ్ షాడో” సృష్టికర్తగా పాఠకుల ఆదరణ పొందినట్లు పేర్కొన్నారు. డిటెక్టివ్ నవలల యుగం తగ్గిన తర్వాత జానపద నవలల రచనను కొనసాగిస్తూ పత్రికా పాఠకులకు చేరువయ్యానని చెప్పారు. తుదిశ్వాస వరకు రచనలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రచయితకు అధ్యయనం, అభ్యాసం, ఊహాశక్తి అవసరమని చెప్పారు. దయాకర్ మాడా అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో డాక్టర్ బీరం సుందరావు “సాహిత్యంలో చమత్కారాలు” అంశంపై మాట్లాడారు. త్యాగరాజు పద్యాలు ఆలపించారు. మాధవి లోకిరెడ్డి జూమ్ ద్వారా మాట్లాడుతూ మధుబాబు రచనలను ప్రశంసించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ పద్యాలు వినిపించారు. డాక్టర్ తోటకూర ప్రసాద్, ప్రొఫెసర్ డాక్టర్ పూదూరు జగదీశ్వరన్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, లెనిన్ వేముల, సతీష్ బండారు, కిరణ్ నిడిగంటి, పవన్ నర్రా, లెనిన్ బందా, ఎస్.కె.ఎస్. రాజు, రామ్ డొక్కా, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, చిన్న సత్యం వీర్నపు, చంద్ర కాటుబోయిన, హరి సింగం, నవీన్ గొడవర్తి, నిడిగంటి గోవర్ధన రావు తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
తెలుగు భాష-సాహిత్య వికాసంలో ప్రసార మాధ్యమాల పాత్రపై తానా సదస్సుబే-ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువాషింగ్టన్ డీసీలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలండన్‌లో వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవంజపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలుభారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరికమలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలు
No Previous Next Article