🕑 Published: April 18, 2026 at 08:38 AM CST
శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ఏప్రిల్ 12, 2026న Crowne Plaza Atlanta NE – Norcrossలో ఘనంగా నిర్వహించిన “Meet ’n Greet” కార్యక్రమంలో Medlytix LLC CEO శ్రీ అరవింద్ కృష్ణస్వామిని సంస్థ సలహా మండలి (Board of Advisors)లో కొత్త సభ్యుడిగా ఆహ్వానిస్తూ ప్రత్యేక స్వాగతం పలికింది. జార్జియా మరియు పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, సంస్థ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. పురోహిత శ్రీ నరసింహాచార్యులు ఆశీస్సులతో, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి, పద్మభూషణ్ డా. జగదీష్ శెత్, బ్రాండ్ అంబాసిడర్లు శంకర్ సుబ్రమణియన్, అరవింద్ కృష్ణస్వామి, జయ కృష్ణస్వామి, డా. కిషోర్ చివుకుల, సలహాదారులు, కోశాధికారి మూర్తి రేకపల్లి, జె.సి. శేఖర్ రెడ్డి, డా. రెడ్డి ఊరిమిండి, మెహర్ లంక తదితరులు పాల్గొన్న జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకకు విశేష ఆకర్షణగా నిలిచాయి. సుస్వర సంగీత విద్యాలయం (శాంతి మెడిచెర్ల), భరత దర్శన్ స్కూల్ (సౌజన్య మధుసూదన్), కళాక్ష్య అకాడమీ (మిటల్ పటేల్), నటరాజ నాట్యాంజలి (నీలిమ గడ్డమనుగు) విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు అందించారు. చెన్నైకి చెందిన గాయకుడు రాము తన గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా, స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (వ్యాఖ్యాతగా కూడా), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల మరియు రాగ వాహినిలతో కలిసి బహుభాషా సంగీతాన్ని అందించారు. ఈ ప్రదర్శనకు అధ్యక్షుడు బాల ఇందుర్తి “ఎస్పీబీ మానసపుత్ర”గా రామును అభివర్ణించడం విశేషం.
ఈ సందర్భంగా అరవింద్ కృష్ణస్వామి అందించిన మొత్తం $555,000 విరాళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో $155,000తో 12 MESU (Mobile Eye Surgical Unit) ‘Adopt-A-Village’ కంటి శిబిరాలకు మద్దతు లభించగా, ఇప్పటికే జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు శిబిరాలు పూర్తయ్యాయి; నాలుగోది నెల్లూరు జిల్లా అనుమాసముద్రంపేటలో జరగనుంది. మిగిలిన ఎనిమిది శిబిరాలు రాబోయే కాలంలో నిర్వహించబడతాయి. అదనంగా, $400,000తో మహారాష్ట్ర లేదా గుజరాత్లో కొత్త MESU యూనిట్ స్థాపనకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఈ పరిచయం ఏర్పడటంలో డల్లాస్కు చెందిన డా. రెడ్డి ఊరిమిండి కీలక పాత్ర పోషించగా, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అరవింద్ కృష్ణస్వామి మధురైలో జన్మించి, బెంగళూరు, న్యూఢిల్లీ, గుజరాత్ (REC సూరత్)లో విద్యాభ్యాసం పూర్తి చేసి, SMU డల్లాస్లో MS మరియు MBA సాధించి, విశాల దృక్పథంతో ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమ విజయానికి అధ్యక్షుడు బాల ఇందుర్తి, మూర్తి రేకపల్లి, మెహర్ లంక, వెంకీ నీలం, నీలిమ గడ్డమనుగు తదితరులతో పాటు అనేక మంది ట్రస్టీలు, కమిటీ సభ్యులు, వాలంటీర్లు కృషి చేశారు. స్పాన్సర్లు మరియు మద్దతుదారులలో జెసి శేఖర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి కుంభం, బాబ్ ఎర్రమిల్లి, వీరేన్ మయాని, డా. మాధవ్ దుర్భ, డా. అపర్ణ దుర్భ, శ్రీకాంత్ రుక్కన్నగారి, కోదండ దేవరపల్లి, జగదీష్ చీమర్ల, ఆనంద్ గార్లపాటి, తిరు చిల్లపల్లి, విజయ్ వేములపల్లి, రాజేష్ వుచాటు, ప్రవణ్ రాఘవన్, ఆర్తి రాఘవన్, శీల లింగం, మాధవి ఇందుర్తి, వెంకట్ రెడ్డి మొండెద్దు, రాఘవ బాబు తడవర్తి, ఆది చిన్నతిమ్మ, శ్రీకాంత్ గొంగల్రెడ్డి, ప్రవీణ్ పురం, ఆనంద్ అక్కినేని, శ్రీధర్ గోలి, భాస్కర్ చీమర్ల, వెంకట్ చెన్నుభొట్ల, రాధ వెంకట్, విజయ లంక, సిద్ధు శ్రీధర్, దుర్గాంబిక నీలం, సహర్ష్త్విక్ కార్తికేయ, నేషేవ్లి, రుసెట్విత అవిలినేలి, నిషేవ్టి అవిలినేలి, రత్న బోనగిరి తదితరులు ఉన్నారు. మరింత సమాచారం కోసం www.sankaranethralayausa.org
లేదా (855) 463-8472 ను సంప్రదించవచ్చు.









