అమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం

🕑 Published: June 19, 2026 at 12:38 PM CST

ఆంధ్రప్రదెశ్ రాజధాని అమరావతిలోని మేధా టవర్స్‌లో రాష్ట్రంలోనే తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సందు, క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఎండీ సూర్యతేజలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోహనకృష్ణ తెలిపారు. ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన చండీగఢ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్ర యువతకు సువర్ణావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి మెంటారింగ్, అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్దేశించే విప్లవాత్మక రంగమని అభివర్ణించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని రాష్ట్ర యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్(CUBIC)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మయూరి టెక్‌లో మోహనకృష్ణ అవగాహన ఒప్పందం(MOU)పై సంతకాలు చేశారు.

📲 Join Our WhatsApp Channel
ఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణ
Previous Article Next Article