🕑 Published: June 28, 2026 at 05:56 PM CST
బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు, అనురాధ దంపతులకు వెంకటేశ్, రామకృష్ణ ఇద్దరు కుమారులు. వెంకటేశ్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కాన్సాస్లో సంభవించిన భారీ వరదలకు కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంకటేశ్ ప్రయాణించే కారు, అందులో బ్యాగు ఉన్నాయని కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం వచ్చింది. కానీ వెంకటేశ్ ఆచూకీ, ఫోన్ లభించకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్లకు లేఖ రాశారు. వెంటనే వెంకటేశ్ ఆచూకీ గుర్తించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
