🕑 Published: July 04, 2026 at 10:52 AM CST
తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాగులూరి భానుప్రకాష్ సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో ఏపీ భాజపా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగును కాపాడుకుందామని, మన చరిత్రను మన పిల్లలకు అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మాతృభూమి-మాతృబాష మన విధానం మన నినాదమని అన్నారు. వృత్తి రీత్యా అమెరికాకు వచ్చినప్పటికీ అన్ని భాషలూ నేర్చుకుని మాతృభాషలో సంభాషించుకుందామని కోరారు.
భాను మాగులూరి మాట్లాడుతూ తెలుగు మన ఆస్తి, అస్తిత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, శంకర్రావు పొన్నం, కృష్ణ మోహన్ జంపాల, సత్యనారాయణరాజు, చంద్రనాధ్ నంబూరు, వెంకట రెడ్డి గోలి, సుబ్బారావు చిట్టెల, రామకృష్ణ రెడ్డి, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటీ, సురేష్, యోగానంద్ వంకిన, నూరిబాబు షేక్, సురేష్ లగిశెట్టి, గణేష్ రెడ్డి బుడిపాటి, రాజా కరణం, రాజేంద్రప్రసాద్ పులిపాటి, ప్రభు బచ్చు తదితరులు పాల్గొన్నారు.



