🕑 Published: August 17, 2026 at 04:22 PM CST
APNRT (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ) సమన్వయకర్తలు, మెల్బోర్న్ ప్రతినిధులు మెల్బోర్న్లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో కాన్సుల్ జనరల్ అనీష్ రాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. తెలుగు ప్రవాసుల సంక్షేమం, అత్యవసర సమయాల్లో సహాయ సమన్వయం, కమ్యూనిటీ గ్రీవెన్స్లను అధికారులకు చేరవేసే విధానంపై చర్చించారు. ప్రమాదాలు, ఆసుపత్రి అత్యవసర పరిస్థితులు, మరణాలు, పాస్పోర్ట్ సమస్యలు, కుటుంబ అత్యవసర వేళల్లో అవసరమైన సాయాన్ని వేగంగా అందించేందుకు APNRT–కాన్సులేట్ మధ్య బలమైన సమన్వయం ఉండాలని ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అనీష్ రాజన్కు సమర్పించారు.
