సిడ్నీలో అష్టావధానం

Featured Image

సిడ్నీ నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. తటవర్తి గురుకులం సంస్థాపకుడు కళ్యాణ చక్రవర్తి అవధానం చేశారు తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకుడిగా వ్యవహరించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో ఈ సాహిత్య ప్రక్రియ సాగింది.

స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలక మండలి సభ్యురాలు సంధ్యా రెడ్డి అతిథిగా పాల్గొని అవధానిని, నిర్వాహకులను అభినందించారు. 11 ఏళ్ల కృష్ణ సుహాస్ గజేంద్రమోక్షం కథ రంజింపజేసింది. ఈ శనివారం మెల్బోర్న్ నగరంలో కళ్యాణ చక్రవర్తి అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ స్వర్ణలత సీతంరాజు తెలిపారు.

Tags-Telugu Ashtavadhanam In Sydney

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles