🕑 Published: March 15, 2026 at 02:55 PM CST
న్యూయార్క్ నగరంలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా-NYTTA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవాన్ని కలిపి ఏర్పాటు చేశారు. న్యూయర్క్, న్యూజెర్సీ పరిసర ప్రాంత తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
మ్యూజికల్ కన్సర్ట్ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాలలు, చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త డా. పైళ్ల మల్లారెడ్డి ఆవిష్కరించారు. నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. వేడుకల విజయానికి సహకరించిన వారికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో నైటా ఉపాధ్యక్షుడు హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.










