🕑 Published: August 30, 2026 at 11:28 AM CST
NVL మెమోరియల్ తెలుగు లైబ్రరీ ఆధ్వర్యంలో "సంకీర్తన" పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని వచ్చే శనివారం నుండి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని బీరం భాగ్య లక్ష్మి, సాయిలక్ష్మి నదిమింటి బోధకులుగా వ్యవహరిస్తారని లైబ్రరీ నిర్వాహకులు నలజుల నాగరాజు తెలిపారు. భగవద్గీత పారాయణ, భక్తిగీతలపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం ఉదయం 9గంటలకు(CST) ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో పాల్గొని సంగీతం, భక్తి గీతాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ నలజల వెంకటేశ్వరులు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి శుభం సంస్థ సహకారం అందిస్తోంది. మరిన్ని వివరాలకు 973-610-4385 నెంబరులో సంప్రదించవచ్చు.

