🕑 Published: September 07, 2026 at 04:31 PM CST
తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ప్రముఖ ఆచార్యుడు, విద్యావేత్త డా.మూల్పూరి వెంకట్రావుని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. "పాఠశాల" అధ్యక్షుడు భానుప్రకాష్ మాగులూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును మననం చేసుకుంటూ ఘన నివాళి అర్పించారు. సమాజ పురోగతికి పునాది అయిన అక్షర జ్ఞానం, విజ్ఞానం అందిస్తూ, దిశానిర్దేశం చేస్తూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసే నిస్వార్థ సేవలను గౌరవించుకోవడం ఆనందదాయకమని వెంకట్రావు అన్నారు.