🕑 Published: September 12, 2026 at 11:01 AM CST
రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ను ఖత్తర్లో ఘనంగా సన్మానించారు. గురువారం నాడు దోహాలో భారత ఎంబసీ, స్థానిక తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబారి డా. శ్రీకర్రెడ్డి ఆమెను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ నిఖత్ జరీన్ యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక స్ఫూర్తి ప్రదాత అన్నారు. తన కష్టం, పట్టుదలతో ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. హరీష్ పాండే, అబ్దుల్ రెహ్మాన్, మణికంటన్, షనవాస్ బావా, తాహా మహ్మద్, కె.ఎస్.ప్రసాద్, కె.కృష్ణకుమార్, అస్నా నఫీజ్, సిరాజ్ అన్సారి, శ్రీధర్ అబ్బగౌని తదితరులు పాల్గొని ప్రసంగించారు.



