🕑 Published: September 15, 2026 at 03:36 PM CST
న్యూజెర్సీలోని ఎడిసన్లో గల సెంటర్ ప్లేస్ ఎట్ ఎడిసన్ (Centre Place at Edison) కమ్యూనిటీ ఆధ్వర్యంలో 4వ వార్షిక గణేష్ ఉత్సవాలు వైభవంగా ప్రారమభమయ్యాయి. సోమవారం నాడు సంప్రదాయబద్ధంగా గణేశ స్థాపన పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. కమ్యూనిటీ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ పల్లెటూరి సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన అలంకరణలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరు రోజుల పాటు గణేశ పూజ, హారతి, గణేశ అభిషేకం, చిన్నారుల భక్తిగీతాలు, నివాసితుల గణేశ భజనలు, నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్, ఢోల్ తాషా, చిన్నారుల కార్యక్రమాలు, గణేశ శోభాయాత్ర వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.




