
అర్వింగ్లో ఘనంగా మహాత్ముని జయంతి. నివాళి అర్పించిన సచిన్.

అమెరికా దేశంలోనే అతి పెద్దదైన అర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ అక్టోబర్ 2వ తేదీన వేకువజామునే మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి విచ్చేశారు.
మహత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సచిన్ ను ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న శ్రమ, ప్రవాస భారతీయుల సమిష్టి కృషి, దాతల దాతృత్వం, అధికారులు అందించిన సహకారాన్ని వివరించారు. సచిన్ మాట్లాడుతూ – గాంధీజయంతి రోజున అమెరికాలో గాంధీస్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమని, మహాత్మాగాంధీ జీవితం ప్రపంచంలో ఉన్న మానవాళిఅంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గ సభ్యులను అభినందించారు.
జయంతి సందర్భంగా శనివారం గాంధీ శాంతి నడక-2025 నిర్వహించారు. ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు మహేంద్రరావు సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జెనరల్ ఆఫ్ ఇండియా డిసి మంజునాథ్, ప్రత్యేక అతిథులుగా సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ టాకూర్, ఆంధ్రప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు, ఐ.ఎ.ఎస్ (రి) హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించి మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నిరతిని గుర్తుచేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఎగురవేశారు.
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బి.యెన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా. జెపి, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. మురళి వెన్నం వందన సమర్పన చేశారు. ఇండియా టుడే కెఫే అధినేత వినోద్ ఉప్పు అల్పాహారం అందజేశారు.
Tags-Gandhi Peace Walk In Irving MGMNT 2025..Sachin Tendulkar Visits MGMNT Irving
Gallery









Latest Articles
- Ata New Jersey Celebrates 2025 Dasara In Edison
- Bam Malaysia Celebrates Dasara Batukamma Diwali 2025
- Sreenivasa Kalyanam In Virginia By Capital Area Rayalaseema Assoc
- Retd Ias Dasari Srinivasulu Tours Dallas And Meets With Nrts
- Tca Toronto Canda Celebrates Batukamma 2025
- Tdf Washington Dc Batukamma Dasara Celebrations
- Adelaide Telangana Association Celebrates Batukamma
- Tagkc Kansas City Batukamma
- Tauk London Batukamma Dasara 2025
- Nats New Jersey Volleyball Competitions 2025
- Experts Warn Of Eb5 Scams In The Us And How To Avoid Them
- Global Telangana Asso Gta Washington Dc Batukamma Dasara 2025
- Weta Celebrates Bathukamma On A Grand Scale
- Ata Bathukamma Celebrations In Chicago
- Tana Prapancha Sahitya Vedika Sep 2025 Meet About Telangana Literary Stalwarts
- Tcss Singapore Batukamma 2025 Grand Success
- Reading Uk Batukamma 2025
- Viksit Bharat Run 2025 In New Jersey
- Tantex 218Th Nela Nela Telugu Vennela Literary Meet
- Myta Malaysia 12Th Annual Batukamma