🕑 Published: March 15, 2026 at 10:58 PM CST
జులై 31, ఆగష్టు 1,2 తేదీల్లో బాల్టిమోర్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వర్జీనియా రాష్ట్రం మనస్సాస్లో పికిల్బాల్ పోటీలు నిర్వహించారు. ఉత్తర వర్జీనియా, రిచ్మాండ్, బాల్టిమోర్ ప్రాంతాలకు చెందిన ప్రవాస క్రీడాకారులు ఈ టోర్నీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందజేశారు. అమెరికావ్యాప్తంగా ఆటా ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, పింగ్పాంగ్, క్యారమ్స్ పోటీలను కూడా నిర్వహిస్తామని అధ్యక్షుడు చల్లా జయంత్ ఒక ప్రకటన్లో తెలిపారు.