🕑 Published: March 19, 2026 at 10:38 AM CST
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) ప్రత్యేకంగా రూపొందించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు.
ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గప్రసాద్, సంతోష్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీతరెడ్డి మిర్యాల, ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివప్రసాద్ ఆవుల, భాస్కరరావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, కార్యవర్గ సభ్యుడు పెరుకు శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాగులపల్లి శ్రీనివాస్, నండూరి సునీత, మహేష్ చెట్టిపెల్లిలు ఆర్థిక సహకారం అందించారు.

