🕑 Published: March 21, 2026 at 09:51 AM CST
జపాన్లోని టోక్యో నగరంలో కొమత్సుగావా(Komatsugawa) పార్క్లో పరాభవ నామ తెలుగు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు స్థానిక జపనీయులు కూడా ఉత్సహాంగా పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి అతిథులకు అందించి దాని ప్రాముఖ్యతను వివరించారు. పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.
పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ పోటీలు, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత బలపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరుగుంతందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ (Telugu association of Japan) కమిటీ సభ్యులకు అతిథులు ధన్యవాదాలు తెలిపారు.
