🕑 Published: March 25, 2026 at 08:26 AM CST
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావులు నేడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచంతో పాటు భారతదేశంపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలు, వాటిని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు, భారత్ పోషిస్తున్న నాయకత్వ పాత్ర గురించి వీరు ప్రధానితో చర్చించారు.
వాజ్పేయి హయాంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో(UNGA) భారతదేశం తరపున మాట్లాడే అవకాశం లభించిన సందర్భాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా డా. దగ్గుబాటి ప్రధానితో పంచుకున్నాను. ఆయన రచించిన The Glimpses of World History పుస్తకాన్ని ప్రధానికి బహుకరించారు. ప్రపంచ చరిత్రపై ఇంతటి సమగ్రమైన పుస్తకాన్ని రచించినందుకు ప్రధాని వెంకటేశ్వరరావును అభినందించారు. దంపతులు ఇరువురూ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకోవడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

