🕑 Published: March 22, 2026 at 11:10 AM CST
ఒమన్ రాజధాని మస్కట్లోని శ్రీకృష్ణ మందిరంలో ఒమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల్లో సైతం ప్రవాసులు ఈ వేడూకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమయిన ఉత్సవం సాయంకాలం మహాప్రసాద నివేదనతో ముగిసింది. భారత రాయబారి జీ.వీ.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచశాంతి పరిఢవిల్లాలని మహాదేవుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు నూనె లక్ష్మణ్ అన్నారు.


