🕑 Published: September 18, 2026 at 04:04 PM CST
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింగపూర్కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. తితిదే, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ (SSKS) ఆధ్వర్యంలో సింగపూర్కు చెందిన 22 మంది ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. వీరంతా సింగపూర్లోని అభినయ నాట్యాలయ, ప్రత్యూష అవధానుల శిష్యబృందం, మాతృశ్రీ సాయి అకాడమీ, నిషిత యాబాజీ శిష్య బృందానికి చెందినవారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ రోజు (సెప్టెంబర్ 19న) తిరుమల మాడవీధుల్లో శ్రీవారికి కూచిపూడి నృత్యంతో నాట్య నివేదన సమర్పించనున్నారు.
విదేశాల్లో పెరుగుతున్న తెలుగు వారికి మన సంస్కృతి, సాహిత్యం, సంగీతం, నృత్య సంప్రదాయాలను పరిచయం చేసి వాటిని కొనసాగించేలా ప్రోత్సహించడమే శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సంస్థ అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు పేర్కొన్నారు.
