మహబూబ్‌నగర్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు

Featured Image

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 2025 ఆటా వేడుకల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో ప్రొఫెసర్ బత్తిని కాంతారెడ్డి, హరీష్ బత్తిని సహకారంతో పెద్దమ్మ తల్లి ఆలయంలో యాగశాల, ఫంక్షన్ హాల్ భూమి పూజ, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.

స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు స్వదేశంలోని గ్రామాల అభివృద్ధికి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డిలు ఆటా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ఆటా ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Seva Days 2025 In Mahabubnagar Supported By Battini Family

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles