విజయవాడలో వేడుకగా జయరాం అభినందన సభ

Featured Image

ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో పాటు పలువురు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ.. కోమటి జయరాం పడిన కష్టానికి గుర్తింపు లభించిందన్నారు. చంద్రబాబు జయరాం వంటి కార్యకర్తలకు మరిన్ని పదవులు ఇవ్వాలని కోరారు. అమరావతి ఉద్యమం సమయంలో, చంద్రబాబు అక్రమ నిర్బంధ సమయంలో జయరాం కష్టపడ్డారని గుర్తుచేశారు. అమెరికాలో ఏ తెలుగువాడికి కష్టం వచ్చినా జయరాం ముందుంటారని కితాబిచ్చారు. ఆయనకు ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.

జయరాం కష్టకాలంలో తెదేపా జెండాను ఇతర దేశాల్లో రెపరెపలాడించారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. తాను అమెరికా వెళ్లిన సమయంలో ఐదారు రాష్ట్రాలు తీసుకెళ్లారని ఎన్‌ఆర్‌ఐలు ఎవరైనా ఆపదలో ఉంటే జయరాం ఆదుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.

కార్యక్రమంలో తాళ్లూరి జయశేఖర్, పాతూరి నాగభూషణం, రఘురామరాజు, గంటా శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, నటుడు రాజేంద్రప్రసాద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సుజన చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags-Komati Jayaram Felicitation Meeting In Vijayawada

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles